హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నివేదిక నేపథ్యంలో మీడియా సంయమనంతో ఉండాలి: డిజిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Aravinda Rao
హైదరాబాద్: విద్యార్థులపై కేసుల ఎత్తివేత ప్రక్రియ ఎంత వేగంగా చేసినా కనీసం నెల రోజుల వరకు పట్టవచ్చని రాష్ట్ర డిజిపి అరవిందరావు గురువారం విలేకరుల ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉద్యమాల నేపథ్యంలో ఎక్కువ కేసులు నమైదైన ప్రాంతాలలోనే ఎక్కువ బలగాలను మోహరించామని ఆయన వివరణ ఇచ్చారు. ఒక ప్రాంతంలో ఎక్కువ మరో ప్రాంతంలో తక్కువ అనేది లేదన్నారు. ప్రజలకు ఎలాంటి హాని కలగని ఆయుధాలను సమకూర్చుకున్నామని చెప్పారు.

ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడమే మా బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 కంపెనీల బలగాలను మోహరించామని, మరో 33 కంపెనీలు రానున్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రజలు కూడ ఆవేశాలకు లోను కావొద్దని కోరారు. ఆంధ్రా-ఒరిస్సా, ఆంధ్రా-ఛత్తీసుఘడ్ రాష్ట్రాల సరిహద్దులలో మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పారు. విశాఖపట్నం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజనులు మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X