వైయస్ జగన్ ను దుయ్యబట్టిన నారా లోకేష్ స్టూడియోఎన్ చానెల్
వైయస్ జగన్ కు సొంత ఎజెండా లేదని, రాజకీయానుభవం లేదని, అందువల్లనే ఓ ప్రణాళిక లేకుండా జగన్ వ్యవహారాలు నడుపుతున్నారని ఆ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఓ కార్యకర్తకు ఉన్న అనుభవం కూడా జగన్కు లేదని విమర్శించారు. కాంగ్రెసు పార్టీని జగన్ వీడడాన్ని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా అభివర్ణించారు. డబ్బు సంపాదించిన జగన్ దాంతో దేనినైనా కొనగలమని భావిస్తున్నారని అన్నారు. ఓదార్పు యాత్రను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓదార్పు యాత్ర బలప్రదర్శనలాగా సాగుతోందని విమర్సించారు. స్టూడియోఎన్ వ్యాఖ్యలతో కాంగ్రెసు పార్టీకి ఓదార్పు లభించేట్లే ఉంది.
Comments
లోకేష్ స్టూడియో ఎన్ వైయస్ జగన్ ఓదార్పు యాత్ర హైదరాబాద్ lokesh studio n ys jagan odarpu yatra hyderabad
Story first published: Tuesday, January 18, 2011, 15:38 [IST]