వీరప్ప మొయిలీపై కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేల ఫైర్

తమ పార్టీ పార్లమెంటు సభ్యుల మాదిరిగానే తాము కూడా రేపటి నుంచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెసు తెలంగాణ శానససభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులు చెప్పారు. లోకసభలో తమ పార్టీ తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు. తెలంగాణపై లోకసభ సభ్యులు పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరించారని ఆయన చెప్పారు. తాము కూడా రేపటి నుంచి శాసనసభలో ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. సమావేశానికి రాని శాసనసభ్యులతో కూడా సమావేశానికి హాజరైన తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు మాట్లాడారు. శానససభ సమావేశమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.












Click it and Unblock the Notifications