వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేషియాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Malaysia
గుంటూరు: ఆంధ్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకతను మలేషియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతన్ని లింగారావుగా గుర్తించారు. అతని స్వస్థలం గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం జంగాలపల్లి గ్రామం. లింగారావు ఆత్మహత్య చేసుకున్నట్లు మలేషియా నుంచి అతని తల్లిదండ్రులకు మంగళవారం ఉదయం ఫోన్ చేసి చెప్పారు. లింగారావు మిత్రులు ఈ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లింగారావు మూడేళ్ల క్రితం మలేషియా వెళ్లాడు. చెన్నైలోని ఓ కంపెనీ తరఫున అతను వెళ్లినట్లు సమాచారం. అతనికి మూడు నెలల క్రితం వివాహమైంది. ఈ నెల 3వ తేదీన అతను స్వస్థలానికి వచ్చి, భార్యను ఇక్కడే వదిలేసి వెళ్లాడు. కుటుంబ కలహాల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కూడా అంటున్నారు. అతని మృతదేహాన్ని దేశానికి తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

English summary
Andhra software engineer dead in Malaysia in suspecious circumastances. Is said that he commted suicide. The deceased is identified as Linga Rao, belongs to Jangalapalli of Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X