టి-మొబైల్ని $30 బిలియన్లకు కోనుగోలు చేసిన ఏటి అండ్ టి
దీంతో ఏటి అండ్ టి మరియు టి-మొబైల్ రెండు యాజమాన్యాలు ఈ డీల్కు ఒప్పుకోవడం వల్ల కంపెనీ పురోగతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా దీనివల్ల నెట్ వర్క్ క్వాలిటీ మరియు సర్వీసెస్ కూడా ఇంకా బాగా అభివృధ్ది చెందుతాయని అన్నారు. రెండు కంపెనీలకు సంబధించినటువంటి కస్టమర్స్కు కూడా చాలా లాభం జరుగుతందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఎక్కవగా వాడుతున్నందున దీనికి కూడా రెండు కంపెనీలు కలిసి చాలా త్వరగా సర్వీస్ ను ప్రోవైడ్ చేయడం జరుగుతందని అన్నారు.
ఈ సందర్బంలో ఏటి అండ్ టి చైర్మన్(సిఈవో)రాన్డాల్ స్టీఫెన్సన్ మాట్లాడుతూ ఈ డీల్ వల్ల యుయస్లో ఉన్నటువంటి 294మిలియన్ జనాభాకు నెట్ వర్క్ విషయంలోగానీ, ఎల్టిఈ విషయాలలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉపయోగపడుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా టి-మొబైల్ని కోనుగోలు చేయడం వల్ల అమెరికా టెక్నికల్ ఇండస్ట్రీ కూడా బాగా అభివృధ్ది చెందుతుందని అనుకుంటున్నానని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి కస్టమర్స్ యొక్క డిమాండ్స్కు మేము చేరువకాగలం అన్నారు. రెండు కంపెనీలకు సంబంధించినటువంటి నెట్ వర్క్ టెక్నాలజీలు, స్పెక్ట్రమ్ ఆపరేషన్స్ కూడా అందరికి అందుబాటులోకి తేవడానికి మావంతు ప్రయత్నం చేస్తామన్నారు. దీంతో పాటు అమెరికా మొత్తాన్ని హైస్పీడ్, వైర్ లెస్ అమెరికాగా తీర్చిదిద్దుతామని అన్నారు.