ఇండియన్ మార్కెట్లోకి శ్యామ్ సంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్

ఈ సందర్బంలో దీపేష్ షా(ఆర్ అండ్ డి సెంటర్, బెంగళూరు) మాట్లాడుతూ ఇండియాలో బడా ఆపరేటింగ్ సిస్టమ్కు మంచి రెప్సాన్స్ వస్తుందని భావిస్తున్నాం అన్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లలో శ్యామ్ సంగ్ మార్కెట్ షేర్ 10-15శాతం వరకు ఉందన్నారు. ఈ సంవత్సరం చివరికల్లా మార్కెట్ షేర్ని 30శాతం వరకు పెంపోందించుకోవాలని చూస్తున్నాం అన్నారు.
శ్యామ్ సంగ్ ఆర్ అండ్ సెంటర్ బెంగుళూరులో ఉంది. ప్రస్తుతం బెంగళూరులో బడా ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ తయారుచేసే పనిలో 2,000 మంది ఇంజనీర్లు నిమగ్నమైనారు. బెంగుళూరులో మాత్రమే కాకుండా కొరియాలో కూడా ఇంకోక డవలపింగ్ సెంటర్ ఉంది. 30శాతం బడా అప్లికేషన్స్ అన్ని ఆ సెంటర్ లోనే చేయడం జరుగుతుందన్నారు. ఇక ఇండియాలో శ్యామ్ సంగ్ బడా ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించినటువంటి అయిదు మోడళ్సు మార్కెట్లో ఉన్నాయని అన్నారు. ఇక వాటి ఖరీదు విషయానికి వస్తే తక్కువలో తక్కువ రూ 8,800 నుండి రూ 20,900 వరకు ఉన్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications