2007వ సంవత్సరం తర్వాత 2011 సాప్ట్వేర్ ఉద్యోగాలకు ల్యాండ్ మార్క్
ఈ సంవత్సరం కొత్తగా చదువులు అయిపోయి దాదాపు 2లక్షల మంది ప్రెష్ గ్యాడ్యుయేట్స్ ఉద్యోగాలలో చేరునున్నట్లు మార్కెట్స్ చెబుతున్నాయి. అదే విధంగా సాప్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి 3లక్షల మంది మరలా ఉద్యోగాల వేటలో పడ్డట్లు వెల్లడించారు. దీంతో పాటు దాదాపు ఒక లక్ష మంది బియస్సి(కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజక్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటివారు దేశం మొత్తం మీద సాప్ట్వేర్ పరిశ్రమలోకి రావడం జరిగింది.
ఇకి ఐటి/ఐటిఈయస్ ఇండస్ట్రీకి చెందినటువంటి దాదాపు 15లక్షల మంది జనాభాలో 25శాతం మంది కొత్త జాబ్లను వెతుక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కంపెనీలో కంటే బయట వారికి ఎక్కవ అవకాశాలు రావడమే ఇలా చేయడానికి ముఖ్య కారణం అని బిఎస్ మూర్తి సిఈవో(లీడర్ షిప్ క్యాపిటల్) తెలియజేశారు. 2010వ సంవత్సరంతో పోల్చుకుంటే క్యాంపస్ లలోగానీ, బయట గానీ దాదాపు 2లక్షల మంది సెలక్ట్ అవ్వగా అదే ఈ సంవత్సరం మాత్రం 4లక్షల మందిని సెలక్ట్ చేసినట్లు సాప్ట్వేర్ వర్గాల సమాచారం.
ఇక 2009వ సంవత్సరాన్ని చాలా వరస్ట్ సంవత్సరంగా పరిగణించడం జరిగింది. ఆ సంవత్సరంలో కనీసం క్యాంపస్ ఇంటర్యూస్ చేయడానికి కూడా కంపెనీలు చాలా భయపడ్డాయి. దానికి కారణం రెసిషన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో లాంటి కంపెనీలు కూడా ఈ సంవత్సరం వారి ఉద్యోగ నియామకాలను కూడా చాలా ఎక్కువ చేశాయి. ఇక ఈ సంవత్సరం టాప్ కంపెనీలు అయినటువంటి ఐబియమ్, హెచ్పి, క్యాప్జెమిని లాంటి కంపెనీలు ప్రెషర్స్ని 70 శాతం నుండి 80 శాతం వరకు హైరింగ్ చేసుకున్నట్లు వెల్లడించారు.