నన్ను చంపేందుకు కేంద్రం కుట్ర, దీక్ష కొనసాగుతుంది: బాబా రామ్దేవ్

శిబిరాన్ని ఖాళీ చేయమని తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. ఆర్ధరాత్రి దొంగల్లా వచ్చి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమపై దాడి చేయడం అమానుషం అన్నారు. తన దీక్షను విరమింప జేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఒత్తిళ్లకు పాల్పడిందని విమర్శించారు. కేంద్రం తరఫువ చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తనను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. తన దీక్షకు వస్తున్న ఆదరణ చూసి కేంద్రం ఈ దమనచర్యకు పాల్పడిందన్నారు. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో పని చేస్తుందని మండిపడ్డారు. తనకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆయన ప్రభుత్వంపై నిప్పులు కక్కారు.












Click it and Unblock the Notifications