Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆహార భద్రతకు రూపాయికి కిలో బియ్యం: ముఖ్యమంత్రి

Kiran Kumar Reddy
హైదరాబాద్: నిరుపేదలకు ఆహార భద్రత కల్పించడానికి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ పార్కులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మంగళవారం జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. అంతకు ముందుకు ఆయన పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు లక్ష రూపాయల మేరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేపడతామని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు. లక్షా యాభై వేల ఉద్యోగాలను కల్పించడానికి తాము సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదుకు చెందిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మినహా తెలంగాణ మంత్రులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా పరిగణిస్తూ నల్లజెండాల ప్రదర్శనకు తెలంగాణవాదులు పూనుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+