ఆహార భద్రతకు రూపాయికి కిలో బియ్యం: ముఖ్యమంత్రి

ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ చేపడతామని ఆయన చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో 3,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన అన్నారు. తమది రైతు ప్రభుత్వమని ఆయన చెప్పుకున్నారు. లక్షా యాభై వేల ఉద్యోగాలను కల్పించడానికి తాము సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదుకు చెందిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ మినహా తెలంగాణ మంత్రులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా పరిగణిస్తూ నల్లజెండాల ప్రదర్శనకు తెలంగాణవాదులు పూనుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications