వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటి వరకు చేసింది చాలు: టి-ఎంపీలకు ప్రణబ్ క్లాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులకు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ గురువారం క్లాస్ పీకారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఎంపీలు సభలో గందరగోళం చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. మూడు రోజులుగా వారిని గమనిస్తున్న ప్రణబ్ గురువారం లోకసభ వాయిదా పడిన తర్వాత ఎంపీలను తన చాంబర్‌కు పిలిపించుకొని ఇప్పటి వరకు చేసింది చాలు ఇక పైన సభను అడ్డుకోవద్దని మండిపడ్డారు. ఇలాగే చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం.

అందుకు వారు తమ పరిస్థితి అర్థం చేసుకోవాలని, తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రోడ్ మ్యాప్ ప్రకటించేంత వరకు తాము నిరసన ఆపేది లేదని ప్రణబ్‌కు చెప్పారు. అయితే అందుకు ప్రణబ్ మరింత తీవ్రంగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణబ్ క్లాస్ పీకడంతో టి-ఎంపీలు ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుండి నిష్క్రమించారు. కాగా ధరలు, విభజనతో లోకసభ దద్దరిల్లడంతో స్పీకర్ మీరా కుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కెసిఆర్, విజయశాంతిలు తెలంగాణ బిల్లు సభలో పెట్టాలంటూ స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు.

English summary
Union Minister Pranab Mukherjee take class to Telangana Congress parliament members today for obstructing sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X