హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సకు వాయిస్ లేకుండా చేశారు: సిఎంపై కాపునాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై కాపునాడు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కాపు వ్యతిరేక ధోరణి వీడారని వారు హెచ్చరించారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణకు వాయిస్ లేకుండా చేశారని విమర్శించారు. పార్టీలోని తమ ముఖ్య నేతకు ఇలా వాయిస్ లేకుండా చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. ముఖ్యమంత్రి చొరవ చూపి కాపులను బ్యాక్‌వర్డ్ క్యాస్ట్(బిసి)లలో చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు.

కాగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్సను లక్ష్యంగా చేసుకొని ఇటీవల ముఖ్యమంత్రి మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారన్న ప్రచారం జరిగింది. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి మొదలు నేటి వరకు బొత్స సిఎంపై అసంతృప్తితోనే ఉన్నారనే చెప్పవచ్చు. అలాగే తాను సూచించిన వారికి కాకుండా తనపై అసంతృప్తిగా ఉన్న బొత్సకు పిసిసి చీఫ్ వచ్చినప్పటి నుండి కిరణ్ కూడా ఆయనపై గుర్రుగానే ఉన్నారు. అధిష్టానం వద్ద ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

English summary
Kapunadu fires at CM Kiran Kumar Reddy for his attitude against PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X