ఆదరించారు, ఇక తెలంగాణ తెచ్చే బాధ్యత మాదే: కిషన్

జాతీయ పార్టీ ద్వారానే తెలంగాణ సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని మహబూబ్ నగర్ నుండి గెలుపొందిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యమాన్ని బిజెపి బలోపేతం చేస్తుందని చెప్పారు. తెలంగాణవాదం గెలిచిందని, ఈ గెలుపుతో బిజెపి బాధ్యత తెలంగాణ విషయంలో మరింత పెరిగిందన్నారు. తన విజయం తెలంగాణ ప్రజల విజయమని నాగర్ కర్నూలులో గెలుపొందిన నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అధిష్టానానికి లేఖ రాయాలన్నారు. టిడిపి బుద్ధి తెచ్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications