యుపిఏ మెడకు మరో బిగ్ స్కాం, 'బొగ్గు' కుంభకోణం

కాగా 2004 - 2009 కాలంలో బొగ్గు గనుల్లో అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొందని సమాచారం. వేలం వేయకుండానే నామినేషన్పై బొగ్గు గనుల కేటాయింపులు కేంద్రం జరిపిందని తెలిపిందని సమాచారం. ఈ కుంభకోణంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధముందని నివేదికలో పేర్కొంది. రూ.10.67 లక్షల కోట్ల మేర అవకవతకలు జరిగాయని తెలిపింది. దేశంలోని ప్రతిష్టాత్మక కంపెనీలు అన్నింటినీ కాగ్ తన నివేదికలో పేర్కొంది. అధానీ, మిట్టల్ గ్రూప్, టాటా, జిందాల్, వేధాంత, అదిత్య బిర్లా, ఎస్ఆర్ గ్రూప్ తదితర కంపెనీల పేర్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. 2004-09 మధ్య కాలంలో 155 బొగ్గు గనులను కేంద్రం ఎలాంటి వేలం వేయకుండానే కేటాయించిందని ఆరోపించింది. కాగా బొగ్గు తదితర నేచరల్ రిసోర్సెస్ కేటాయింపులు వేలం ద్వారా నిర్వహించాలని సుప్రీం కోర్టు చెప్పింది.












Click it and Unblock the Notifications