భాను కిరణ్కు కర్ణాటక మాజీ సిఎం చేయూత?

హైదరాబాద్లోని ఖాజాగూడలో సుమారు రూ.75 కోట్ల విలువచేసే భూమి ఓ సినీ నిర్మాత పేరుతో పెట్టినట్లు మూడో రోజు కస్టడీలో వెల్లడించిన భానుకిరణ్ తాజాగా బెంగళూరులోని ఆస్తుల చిట్టా విప్పినట్లు వార్తలు వచ్చాయి. నాలుగు రోజుల కితం కస్టడీకి తీసుకొని భాను, కృష్ణను విచారిస్తున్న సిఐడి అధికారులు వీరి బినామీ ఆస్తులను రట్టుచేసే పనిలో పడ్డారు. చిత్రపురి కాలనీకి సమీపంలో ఉన్న ఐదెకరాల భూమి తనదేనని, ఓ సినీ నిర్మాత పేరుతో ఉంచానని భాను ఇప్పటికే బయటపెట్టినట్లు చెబుతున్నారు.
బెంగళూరులో ఉన్న ఆస్తుల్లో కొన్నింటి వివరాలను బుధవారం వెల్లడించినట్లు తెలిసింది. సూరి జైల్లో ఉన్నప్పుడు భాను ఇక్కడ పలు సెటిల్మెం ట్లు చేసి వసూలు చేసిన సొమ్ముతో బెంగళూరులో ఆస్తులు కూడ బెట్టాడు. బెంగళూరు శివార్లలో రూ.30 కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమి తన బంధువుల పేర పెట్టినట్లు తెలిసింది.
దంతలూరి కృష్ణ, మధుమోహన్, స్నేహలతారెడ్డి, శ్రీకాంత్గౌడ్ తదితరులతో దందాలు చేయగా వచ్చిన సొమ్ములో కొంత మేర సూరి కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఇందులో సింహభాగం బెంగళూరులో ఆస్తులు పోగు చేసుకున్నట్లు తెలుస్తోంది. భాను ఇక్కడ ఏ సినీ నిర్మాతతో కలిసి సెటిల్మెంట్లు చేశారని చెబుతున్నారో అదే నిర్మాతకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఒకరితో సత్సంబంధాలున్నాయి. తరచూ ఆయన మాదాపూర్లో గెస్ట్హౌస్కు వస్తుంటారని భాను వెల్లడించినట్లు సమాచారం.
రాజకీయంగా ఆయన సహకారం ఉండటం వల్లే బెంగళూరులో ఆస్తులు పోగు చేసుకొన్నట్లు తెలిసింది. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో మంగళవారం అరెస్టయిన వంశీరెడ్డి పేరుతో బెంగళూరులోని గద్దెనహళ్లి ప్రాంతంలో సిమెంట్ ట్రేడింగ్ చేస్తున్నట్లు సీఐడీ కస్టడీలో భానుకిరణ్ వెల్లడించాడని భోగట్టా. వీనస్ ట్రేడర్స్ పేరుతో జరుగుతున్న ఈ ట్రేడింగ్తో పాటు, కోరమంగళ ప్రాంతంలో బినామీ పేరుతో భాను నిర్వహిస్తున్న హోటల్ ఏడాది టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications