వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రో ధరలు పెంచం కానీ, కఠిన నిర్ణయాలే: జైపాల్ రెడ్డి
కాగా రెండు రోజుల క్రితం పెట్రో ధరలను పెంచాలని పెట్రోలియం శాఖ... మంత్రివర్గానికి నోట్ పంపింది. పెట్రో ఉత్పత్తులపైన ఆయిల్ కంపెనీలకు రోజుకు రూ.550 కోట్ల నష్టం వస్తోందని ఈ నోట్లో పేర్కొన్నారు. ఇందువల్ల పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు రూ.5 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు జోరుగా రావడం, కేంద్రంపై పలువురు మండిపడుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి ఈ రోజు దానిపై వివరణ ఇచ్చారు. ధరల పెంపుదల వార్తలను కొట్టి పారేశారు. కాగా జైపాల్ రెడ్డి ధరలు పెంచే యోచన లేదని చెప్పడంతో ఆ ఎఫెక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడుతోంది. ఐవోసీ, హెచ్పిసిఎల్, భారత్ పెట్రోలియం షేర్ల ధరలు పడిపోతున్నాయి.
English summary
Petroleum Minister S Jaipal Reddy today said that there is no immediate plan to raise fuel prices.
Although, he also added, "We have to take some difficult, painful decisions."
Story first published: Friday, September 7, 2012, 13:59 [IST]