వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లొచ్చాకే: ఎర్రన్నాయుడు
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. బాబు వస్తున్నా నీకోసం పాదయాత్రతో అన్ని పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు. చంద్రబాబు పాదయాత్రతో ప్రజల సమస్యలను, వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారని ఎర్రన్నాయుడు చెప్పారు.
కుటుంబంతో చెబితే...
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు కాళ్ల నొప్పులు ఉన్నాయని కుటుంబ సభ్యులతో పిచ్చాపాటిగా మాట్లాడితే ఇతర పార్టీలో హేళన చేయడం సరికాదని అనంతపురం జిల్లాలో పార్టీ నేత అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తమ అధినేత పైన విమర్శలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వచ్చే ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
బాబు యాత్రలో ప్రజలు కాంగ్రెసు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. విద్యుత్ సమస్యలు, కడగండ్ల కష్టాలను ప్రజలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బాబు వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నారని చెప్పారు. బాబు యాత్రలో ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు. బొత్సకు దమ్ముంటే ఓ రోజు బాబుతో పాటు పాదయాత్ర చేస్తే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు.