హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవే చెప్పాలి, జంప్స్‌పై బొత్సది తప్పు: పాలడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paladugu Venkat Rao
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన విషయమై కేంద్రమంత్రి చిరంజీవే ప్రజలకు చెప్పాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు బుదవారం అన్నారు. పిఆర్పీని కాంగ్రెసులు విలీనం ఎందుకు చేశారో ఆయనే చెబుతారన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీలో హిట్లర్ లక్షణాలు ఉన్నాయని విమర్శించారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను పాలడుగు తప్పు పట్టారు. పార్టీ నుండి వెళ్లే వాళ్లు వెళతారని చెప్పడం సరికాదన్నారు. ఒక పార్టీ నుండి గెలిచిన వారు పదవీకాలం పూర్తయ్యే వరకు ఆ పార్టీలోనే కొనసాగాలన్నారు. అది నైతిక ధర్మం అన్నారు. కాంగ్రెసులో ఉండే వారు ఉంటారు, వెళ్లేవారు వెళతారు అని బొత్స వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

గుణగణాలు చూడకుండా టిక్కెట్లు కేటాయిస్తే ఇలాంటి ఇబ్బందులే వస్తాయన్నారు. డబ్బుకు కాకుండా సంస్కారాన్ని చూసి టిక్కెట్లు ఇవ్వాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలా అయితేనే ఫిరాయింపులను అడ్డుకోగల్గుతామన్నారు.

English summary

 Congress party senior leader Paladugu Venkat Rao said central minister Chiranjeevi will answer to the state people on merger issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X