ఏంజరిగినా మతాన్నిముందుకు తెస్తోంది: మజ్లిస్పై టిజి

వెనుకబడిన కర్నూలు జిల్లాకు నిధులు పెంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కాంగ్రెసుతో పోటీపడి రాయలసీమలో గెలవలేమనే మజ్లిస్ ఇలా చేస్తోందన్నారు. మజ్లిస్ పార్టీతో చర్చలు కొనసాగుతున్నాయని హైదరాబాదులో కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఒక్కటే అసలైన సెక్యులర్ పార్టీ అన్నారు. భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. పాతబస్తీలో జరిగిన సంఘటనతో ముస్లింల మనోభావాలు దెబ్బతిని ఉంటాయని తాము భావిస్తున్నామన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డియే 2014 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి కొండ్రు మురళీ మోహన్ వేరుగా అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మజ్లిస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని, అవి ఫలవంతమవుతాయని తాము భావిస్తున్నామన్నారు.
మజ్లిస్ పార్టీ నేతలతో అధిష్టానం కూడా సంప్రదింపులు జరుపుతోందని ఎంపి ఎంఏ ఖాన్ అన్నారు. కాంగ్రెసుకు మద్దతు ఉపసంహరణపై వారు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాలనాపరంగా తప్పిదాలు ఏవైనా జరిగి ఉంటే సరిదిద్దుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications