ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అక్బరుద్దీన్

రేపు శనివారం పది గంటల నుంచి 17వ తేదీ ఉదయం పది గంటల వరకు అక్బరుద్దీన్ను కోర్టు పోలీసు కస్డడీకి అప్పగించింది. 17వ తేదీ ఉదయం పది గంటల తర్వాత తమ ముందు అక్బరుద్దీన్ను ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించి తమ విచారణలో అక్బరుద్దీన్ గొంతును సరిపోల్చుకునే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని హైదరాబాదులోని నాంపల్లి కోరటు మంగళహాట్ పోలీసులను ఆదేశించింది. కేసుపై దర్యాప్తు చేసి ఫిబ్రవరి 11వ తేదీలోగా తమకు నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అక్బరుద్దీన్పై హైదరాబాద్ కార్పోరేటర్ రాజాసింగ్ చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
అదిలాబాద్ సబ్ జైలులో ఉన్న మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి శుక్రవారం కడుపు నొప్పి వచ్చింది. జిల్లా జడ్జి మధుసూదన్ మధ్యాహ్నం జైలును సందర్శించారు. ఈ సమయంలో అక్బరుద్దీన్ తనకు కడుపు నొప్పి వచ్చిందని జడ్జికి తెలియజేశారు. దీంతో ఆ జడ్జి వెంటనే రిమ్స్ వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్కు వైద్యులు చికిత్స అందించారు. అజీర్తి కారణంగా అక్బర్కు కడుపు నొప్పి వచ్చిందని వైద్యులు తెలిపారు.
మరోవైపు ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలన్న అక్బరుద్దీన్ పిటిషన్ పైన విచారణను కోర్టు ఈ నెల 16వ తేదికి వాయిదా వేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications