ఎంపిగా నటి రమ్య ప్రమాణం, సభలో విహెచ్పి యాత్ర, టి
న్యూఢిల్లీ: కర్నాటక ఉప ఎన్నికల్లో మాండ్య, బెంగళూరు రూరల్ స్థానాల నుండి గెలుపొందిన రమ్య, డికె సురేష్లు సోమవారం ఉదయం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. లోకసభ స్పీకర్ మీరా కుమార్ వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే వారిచే ప్రమాణం చేయించారు.
కాగా, విశ్వ హిందూ పరిషత్ కోసి పరిక్రమ యాత్ర ఉత్తర ప్రదేశ్లో వివాదం రగిలించిన విషయం తెలిసిందే. ఆదివారం పలువురు విహెచ్పి నేతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దీనిపై బిజెపి పార్లమెంటులో నిలదీసింది.

రాజ్యసభలో ఎస్పీ, బిజెపి సభ్యుల పోటాపోటీగా నినాదాలు చేశారు. చైర్మన్ శాంతించాలని కోరినా సభ్యులు వినలేదు. మరోవైపు టిడిపి ఎంపీలు సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
కాగా, విహెచ్పి యాత్ర పైన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పందించారు. సాధు సంతులను అవమానపర్చడం తమ ప్రభుత్వం ఉద్దేశ్యం కాదని చెప్పారు. బిజెపి సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయోధ్య విషయంలో యథాస్థితి కాపాడాలని సుప్రీం ఆదేశాలు ఉన్నాయని, కోర్టు ఆదేశాలను యుపి ప్రభుత్వం నిక్కచ్చిగా పాటిస్తోందన్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications