మూడేళ్లుగా 14 మందిపై వార్డెన్ అత్యాచారం, అరెస్ట్
ఈటానగర్: ఓ హాస్టల్ వార్డెన్ గత కొన్ని ఏళ్లుగా పద్నాలుగు మంది మైనర్ బాలికల పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన అరుణాచల్ ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వెస్య్ సియాంగ్ జిల్లా లికాబాయిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో వార్డెన్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు.
ఈ విషయాన్ని కొద్ది రోజులుగా విద్యార్థులు బయటకు చెప్పేందుకు భయపడ్డారు. అయితే, బాధితుల్లో కొందరు దీనిని పోలీసులకు తెలియజేశారు. అత్యాచార బాధిత బాలికలలో నాలుగేళ్ల నుండి పదమూడేళ్ల వరకు ఉన్నారు.

విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వారు స్థానిక పోలీసు స్టేషన్ను ముట్టడించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం కొద్దిమంది విద్యార్థులు తమకు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడు, రాష్ట్రేతరుడైన విపిన్ను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరో ఇద్దరిని విచారించారు.
కేసు నమోదు చేసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. బాధిత బాలికలు గత మూడేళ్లుగా ఆ పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు విద్యార్థులను హెచ్చరించారని చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications