42 మందికి ప్రయోజనం..? చంద్రబాబుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విసుర్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. విద్యుత్ రంగంపై ఇవాళ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఆయన ప్రస్తావించారు. తక్కువ సమయంలో ఎలా కేటాయింపులు చేశారని అడిగారు.
టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నష్టాల్లోకి వెళ్లిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. యూనిట్ రూ.2 దొరికే విద్యుత్ను రూ.4.83 పైసలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రజల సొమ్మును చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా 42 మందికి ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. కేవలం 45 రోజుల్లో హుటాహుటిన 42 అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారని విరుచుకుపడ్డారు.

గత ప్రభుత్వ చర్యతో వేల కోట్ల రూపాయలు భారం పడిందన్నారు. ఆ పరిస్థితుల్లో వాయు విద్యుత్ గురించి రివ్యూ చేశారని చెప్పారు. 45 రోజుల్లో 42 అగ్రిమెంట్లపై సమీక్షించారని తెలిపారు. విండ్ మిల్లు పెట్టాలంటే సంవత్సర సమయం పడుతుందని.. కానీ 45 రోజుల్లోపే ఒప్పందం, విద్యుత్ ఉత్పత్తి కూడా చేసినట్లు టీడీపీ ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల వారికి 50 పైసలు యూనిట్కు ఇన్సెంటివ్ ఇచ్చినట్టు చెప్పుకుందని తెలిపారు. ఇవీ లెక్క చేస్తే రూ.2 వేల కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చిందన్నారు. ప్రజలు కట్టే పన్ను ఆదాయం 42 మందికి ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని చెప్పారు. అదీ తప్పు అని చెప్పేందుకే తాము వాయు విద్యుత్పై రివ్యూ చేశామని వివరించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications