Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మకానికో బడి, ఏపీ సర్కార్‌పై పవన్ కల్యాణ్ విసుర్లు

ఏపీ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతుంటామని, కానీ పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. కనీసం వారికి ఇష్టమైన మీడియంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మ ఒడి అని..

అమ్మ ఒడి అని..

పాఠశాల తీసేయొద్దు అంటూ ఆ పసివాళ్లు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అప్పుడు అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు అమ్మకానికో బడి అంటున్నారని విమర్శించారు. ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై ఏపీ సర్కారు నవంబరు 12న నాలుగు ఆప్షన్లతో సర్క్యులర్ మెమో ఇచ్చిందని పవన్ గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలో 2,200 ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, 2 లక్షల మంది విద్యార్థులతోపాటు 6,700 మంది టీచర్లు ప్రభావితం అవుతారని తెలిపారు.

2.5 లక్షల మంది విద్యార్థులు

2.5 లక్షల మంది విద్యార్థులు

182 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 71 వేల మంది విద్యార్థులు, 116 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 2.5 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఆయా ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపైనా ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. నష్టపోయేది విద్యార్థులేనని, ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకింత హడావుడి చేస్తుందో అర్థంకావడం లేదని కామెంట్ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా, ఒక అనాలోచిత విధానాన్ని అమలు చేయడం సరైన నిర్ణయమేనా అని ఆయన ప్రశ్నించారు.

విలీనం చేయడమే మార్గం..

విలీనం చేయడమే మార్గం..


ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నిజంగా సాయపడాలని అనుకుంటే వాటిని విలీనం చేసుకోవడం ఒక్కటే మార్గమా? ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ విధానాలు ఏవీ లేవా? అని నిలదీశారు. వైసీపీ సర్కారు దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. "విద్యాసంవత్సరం మధ్యలో ఉండగా ఎయిడెడ్ పాఠశాలలు మూసివేస్తామని వివరించారు. ఆ విద్యార్థులను సమీపంలోని ఇతర విద్యాసంస్థల్లో చేర్చుతామని అంటారని వివరించారు. ఆ విద్యాసంవత్సరంలో కుదుపులకు గురికారా? వైసీపీ ప్రభుత్వం ఇంతకీ ఉపాధ్యాయ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? అని అడిగారు.

ఖాళీలు ఎప్పుడూ భర్తీ..

ఖాళీలు ఎప్పుడూ భర్తీ..


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తుంది? అని పవన్ కల్యాణ్ నిలదీశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్లను, లెక్చరర్లను నియమించి, తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థల గురించి ఆలోచించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+