70 రోజుల్లోనే 98 మంది రైతుల ఆత్మహత్య ... ఇదేనా జగన్ పాలన అన్న మాజీ మంత్రి
ఏపీలో వైసీపీ సర్కారు పాలనపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి శూన్యం అని ఆయన విమర్శించారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నామన్న పేరుతో కూల్చివేతలు, టెండర్ల రద్దులు తప్ప జగన్ సర్కార్ చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. అయితే జగన్ 70 రోజుల పాలనలో ఎవరికి ఏమి ఒరిగింది లేదన్న మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని పేర్కొన్నారు.

పరిశ్రమలు, ప్రాజెక్టులను ఆపడానికి మాత్రమే వైసీపీ పని చేస్తుందన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హయాంలో వచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టులను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంచి నేత ఉన్నప్పుడే మంచి పరిపాలన కొనసాగుతోందని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అని అభివృద్ధి పథకాలు మాత్రం ఆపడం సరికాదని ఆయన మండిపడ్డారు. అంతేకాదు సీఎం జగన్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయని పేర్కొన్నారు మాజీ మంత్రి. జగన్ నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.

వైసీపీ పాలనలో 98 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడిన కాల్వ శ్రీనివాసులు
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దాదాపుగా 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు రైతులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోవడం వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈ 70 రోజులలోనే 98 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే జగన్ పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్ పై రైతుల్లో నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయిందని పేర్కొన్న కాల్వ శ్రీనివాసులు అన్నదాతల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు.

70 రోజుల జగన్ పాలనలో చేసిందేమీ లేదని తేల్చేసిన మాజీ మంత్రి
జగన్ సర్కార్ రైతులకు అండగా ఉండాల్సింది పోయి రుణ ఉపశమన పథకం నాలుగు, ఐదు విడతల చెల్లింపులను నిలిపివేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు . రైతులను ఉద్ధరిస్తామని చెప్పి రైతుభరోసా పథకం తీసుకొచ్చారని, తొలుత రూ.12,500 ఇస్తామన్నారు. ఆ తర్వాత కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామనడం శోచనీయమని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శలు గుప్పించారు. మొత్తానికి 70 రోజుల జగన్ పాలనలో చేసిందేమీ లేదని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications