అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..!
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ సీఎం చంద్రబాబు చెప్తున్న మాటలు డొల్ల అని, ఇది రాష్ట్రానికి భవిష్యత్తులో గుదిబండగా మారబోతోందని వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. తాజాగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు అబద్దమని నిరూపించేలా అమరావతికి సంబంధించిన గణాంకాలను ఆయన ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబు మాటల ప్రకారమే లెక్కిస్తే అమరావతిలో ఏం జరగబోతోందో ఆయన కుండబద్దలు కొట్టారు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైయస్పార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు చెబుతున్న మాటలు అబద్ధాలని సజ్జల ఆరోపించారు. కాకి లెక్కలతో ప్రజలను నమ్మించబోయి, అడ్డంగా దొరికిపోయారన్నారు. ఆయన మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమేనన్నారు. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి రూ.10 కోట్లు అని చెప్తుకుంటున్నారని, కానీ అక్కడ చంద్రబాబు ఇంటి కోసం కొన్న 5 ఎకరాల స్థలం ధర గజం రూ.7,500 అని, దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లే అన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్కడ గజం భూమి రూ.6 వేలే అన్నారు. ఆ లెక్క ప్రకారం ఎకరం భూమి రూ.2.91 కోట్లు ఉందన్నారు.

12.04.2026.
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 12, 2026
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని, ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ రూ.50 వేల కోట్లు పైమాటేనని, అమరావతిపై ద్వేషంతోనే వైయస్పార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు నిన్న మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు.…
అయినా చంద్రబాబు లెక్క ప్రకారం ఆయన కొన్నట్లు గజం రూ.7500 చొప్పున లెక్క వేసుకున్నా, ఆ ధర ప్రకారం 5 వేల ఎకరాలు అమ్మినా, ఎవరైనా కొంటానన్నా వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లే అన్నారు. అంతకు మించి పైసా రాదన్నారు. ఇంకా దానికి వడ్డీ లెక్కేయడం లేదన్నారు. అమరావతిలో ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ రూ.50 వేలకు కోట్లకు పైనే అని, ఇంకా అక్కడ కనీస మౌలిక సదుపాయాల కోసమే ఆయన చెబుతున్న ఖర్చు ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున.. ఇప్పుడు సేకరించే దాన్ని కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.2 లక్షల కోట్లు అన్నారు. కానీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అప్పు. ఇంకా తెచ్చేది కూడా అప్పు. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుందన్నారు.

– మీ మాటల ప్రకారమే ఆ ప్రాజెక్టులో ఆదాయం తీసుకొచ్చే ఏకైక వనరు కేవలం 5 వేల ఎకరాల భూమి మాత్రమే. ఇప్పుడు అక్కడ ఎకరం భూమి విలువ రూ.10 కోట్లు అని మీరంటున్నారు.
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 12, 2026
– కానీ, అక్కడ మీరు మీ ఇంటి కోసం కొన్న 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500. మీ దస్తావేజుల ప్రకారమే లెక్క కడితే ఎకరం…
పోనీ చంద్రబాబు అనుకున్నట్లు అభివృద్ధి చెందాక ఎకరం విలువ రూ.20 కోట్లు అవుతుందనుకుంటే..ఆ అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు, 15 ఏళ్లు పడుతుందని లోకేష్ అంటున్నారన్నారు. మరి అప్పటికి వడ్డీనే రూ.3 లక్షల కోట్లు అవుతుందా? లేక రూ.4 లక్షల కోట్లు అవుతుందా? నిజం చెప్పాలంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మీరు అప్పు చేయాల్సిందే కదా. మరి అలాంటప్పుడు ఆ అప్పు మీద వడ్డీ మాటేమిటి? అని ప్రశ్నించారు. మీకు సంపద సృష్టి కోసం అవి పనికి రావొచ్చని, కానీ రాష్ట్రం మీద పడే భారం మాటేమిటన్నారు. ఇప్పుడు ఈ విషయం మీకుచెప్పి కూడా లాభం లేదని, ఎందుకంటే ఈ లెక్కలు మీకు కూడా తెలుసని సజ్జల చంద్రబాబుకు తెలిపారు. ఇప్పుడు ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజలే అన్నారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే, చంద్రబాబుగారి మార్క్ 'ఎండ మావి'జన్ కావాలా? అందులో పదో వంతు ఖర్చుతో-అదీ దశలవారీగా-రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ మార్క్ గ్రోత్ ఇంజన్ 'మావిగన్' కావాలా? అని ప్రశ్నించారు.
-
అమరావతి ఖర్చు అసలు లెక్క ఇదీ..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం













Click it and Unblock the Notifications