Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో సవరణ బిల్లు ఆమోదం పొందిన వేళ, రాజధాని ప్రాంతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఉద్దండరాయుని పాలెం చేరుకుని, రాజధాని రైతులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

తన సతీమణి భువనేశ్వరితో కలిసి అమరావతి శంకుస్థాపన శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెచ్చిన పవిత్ర మట్టి, యమునా నది జలాలు ఉంచిన వేదిక వద్ద దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దీప హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన ముఖ్యమంత్రి, ఆ పవిత్ర వేదికకు సాష్టాంగ ప్రణామం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మరియు వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

Amaravati is Unstoppable CM Chandrababu Prostrates at Foundation Site After Parliament Passes Capital Bill

అమరావతి చరిత్ర శాశ్వతం.. రైతుల త్యాగం అమరం!

అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, ఈ రోజు దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని కొనియాడారు. "అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం. అనేక కుట్రలను ఎదుర్కొని, ఐదేళ్ల చీకటి రోజులను దాటుకుని ఇవాళ ప్రజా రాజధానిని సాధించుకున్నాం. ఇది ప్రజా సంకల్పానికి దక్కిన విజయం" అని ప్రకటించారు. 29 వేల మంది రైతులు నమ్మకంతో ఇచ్చిన 33 వేల ఎకరాల భూమి వల్లే ఇవాళ రాజధానికి ఈ స్థాయి దక్కిందని, వారి త్యాగం శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడారు.

Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..!
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..!

వైసీపీ విధ్వంసంపై నిప్పులు.. ప్రధానికి కృతజ్ఞతలు..

గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రజావేదిక విధ్వంసంతో మొదలుపెట్టి అమరావతిని స్మశానంగా మార్చాలని చూశారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడి అడ్రస్ లేకుండా పోయారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తుంటే పార్లమెంటు నుంచి వాకౌట్ చేసిన వైసీపీని, ప్రజలే బ్లాక్ అవుట్ చేయాలి" అని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు మరియు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

 అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!!

ఉద్యమ వీరత్వం.. భవిష్యత్తు విజన్..

రాజధాని కోసం మహిళలు, రైతులు చేసిన 1631 రోజుల పోరాటాన్ని చంద్రబాబు స్మరించుకున్నారు. నాడు తన సతీమణి భువనేశ్వరి ఉద్యమానికి మద్దతుగా తన చేతి గాజులను ఇచ్చారని, పవన్ కళ్యాణ్ ముళ్ల కంచెలు దాటుకుని వచ్చి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. "అమరావతి అజేయం, అజరామరం. పార్లమెంటులో చేసిన ఈ చట్టాన్ని ఇక ఎవరూ మార్చలేరు. ప్రజల సహకారంతో ప్రపంచంలోని అత్యుత్తమ అభివృద్ధి మోడల్స్‌ను అమరావతికి తెస్తాను. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని సమానంగా అభివృద్ధి చేస్తా" అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. "ఇప్పటి వరకు మన రాష్ట్రానికి సరైన అడ్రస్ లేదు, ఇప్పుడు అమరావతి రూపంలో మనకు శాశ్వత అడ్రస్ వచ్చింది" అని ప్రకటిస్తూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+