Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తాజాగా ముగిశాయి. అయితే ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక్కరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఈ భేటీ వెనుక ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధాని కార్యాలయం ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చింది, ఈ ప్రత్యేక సమావేశంలో ఏం చర్చించబోతున్నారనేది ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గతంలో అమరావతి(Amaravati)ని టీడీపీ సర్కార్ ఖరారు చేసినా కేంద్రం పార్లమెంట్ లో ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో వైసీపీ ప్రభుత్వం రాగానే దాన్ని మార్చి మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్దమైంది. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా కూటమి ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏపీ పునర్ విభజన చట్టాన్ని సవరించి ఏపీని రాజధానిగా చేర్చాలని కేంద్రాన్ని కోరుతోంది. దీంతో కేంద్రం కూడా తగు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. దీనికి ముందు ఏపీ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు ఓ తీర్మానం వెళ్లాల్సి ఉంది. అది లేకుండా పార్లమెంట్ లో కేంద్రం నేరుగా సవరణ బిల్లు పెట్టి రాజధానిని గుర్తించడం సాధ్యం కాదు. ఈ మేరకు న్యాయనిపుణులు ఇచ్చిన సలహా మేరకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం వెంటనే చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో సమాచారం ఇచ్చింది. దీంతో ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేస్తారు. అనంతరం దీన్ని కేంద్రానికి పంపుతారు. దీని ఆధారంగా పార్లమెంట్ లో కేంద్రం చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తుంది.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!














Click it and Unblock the Notifications