Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇప్పుడే ప్రయాణం ప్రారంభమైంది.. లోకేష్ ట్వీట్ కు ఆసక్తికర సమాధానమిచ్చిన ఆనంద్ మహీంద్రా!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారు అనే విషయం ప్రతిఒక్కరికి తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో చాలా సృజనాత్మకమైన ఆసక్తికరమైన వీడియోలను పెట్టి తనదైన శైలిలో చెబుతూ ఉంటారు. మంచి గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తుల గురించి తరచూ పోస్టు పెడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా తన కంపెనీకి సంబంధించిన అనేక పురోగతి విషయాలను పంచుకుంటూ అభిమానులకు తమ కంపెనీ చేస్తున్నది వివరిస్తూ ఉంటారు

ఆనంద్ మహీంద్ర పోస్టుకు స్పందించిన మంత్రి నారా లోకేష్
ఈ క్రమంలో ఆయన తాజాగా ప్యూరియో ట్రక్కుకు సంబంధించిన తెలుగు ప్రకటనను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంటుంది. ట్రక్కును సొంతం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి" అంటూ ఆయన దానికి క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ వీడియో చూసి స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్, ఆ యాడ్ చాలా బాగుందని పేర్కొన్నారు.

Anand Mahindra gave an interesting reply to minister Lokesh invitation

Take a Poll

మహీంద్రాకంపెనీకి స్వాగతం పలికిన లోకేష్
ఇది తెలుగు ప్రజలకు తప్పకుండా నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహేంద్ర కంపెనీని ఎందుకు ఏర్పాటు చేయకూడదని ఆయన ఈ పోస్టును చూసి ప్రశ్నించారు. మహీంద్రా కంపెనీకి ఆతిథ్యం ఇవ్వడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని లోకేష్ తెలియజేశారు.

లోకేష్ స్పందనపై ఆనంద్ మహీంద్రా ప్రతిస్పందన
ఇక తను పెట్టిన వీడియో పై స్పందించిన లోకేష్ స్పందనకు ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడం తమకు గర్వకారణంగా ఉంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. పర్యాటకం, సూక్ష్మ నీటిపారుదల, సోలార్ విద్యుత్ వంటి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ బృందం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ప్రజల్లో ఆనంద్ మహీంద్రా పోస్ట్ తో హర్షం
ఆంధ్రప్రదేశ్‌తో తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, ముందు ఇంకా చాలా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు ఏపీ ప్రజలకు సంతోషం కలిగిస్తుంది.ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ నుండి సూక్ష్మ నీటిపారుదల వరకు అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని, దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన చెప్పడంతో చాలామంది ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+