ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కీలకవ్యాఖ్యలు చేసింది. దశాబ్దాలుగా తక్కువ వేతనాలతో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకోవడం శ్రమదోపిడి అని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేంధుసామంతతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
ఉద్యోగులను రెండు నెలల్లోగా క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన పోస్టుల్లోనూ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపడుతోందని కోర్టు గమనించింది. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటూ, వారిని రోజువారీ వేతన జీవులుగా ఉంచడం సరికాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో, పిటిషన్ దాఖలు చేసిన ఉద్యోగులను రెండు నెలల్లోగా క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు
అంతేకాకుండా, పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడాన్ని నిరాకరిస్తూ గతంలో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సైతం హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.ఇలాంటి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శవంతమైన యజమానిగా వ్యవహరించాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. అర్హతలు ఉన్న వారిని, తక్కువ వేతనాలకు అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
తమను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్
సాంకేతిక కారణాలు, నియామకాలు సక్రమంగా జరగలేదని చెప్పే సాకులు, హక్కులను నిరాకరించడానికి తగవని స్పష్టం చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టైపిస్టులు, వాచ్మెన్ లు, గార్డినర్ లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్ లు, డ్రైవర్లు వంటి పలు ఉద్యోగులు, తెలుగుగంగ ప్రాజెక్టు కోసం పనిచేసిన ఉద్యోగులు కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తాము పని చేస్తున్నామని తమను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.
హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
ఈ పిటిషన్లను విచారించిన ఏపీఏటి, పిటిషనర్లు క్రమబద్ధీకరణకు అర్హులు కారని తీర్పు ను ఇచ్చి ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో వారు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఇక ఈ తీర్పుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
-
చెరువుల పక్కన ప్రభుత్వ భూములపై హైడ్రా కమిషనర్ కీలక ఆదేశాలు! -
ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ













Click it and Unblock the Notifications