జగన్ నిర్ణయంపై ఉత్కంఠ- వారం రోజులే గడువు- రాజధాని మార్పు నేపథ్యం.......
ఏపీలో రాజధాని మార్పు నేపథ్యంలో ప్రభుత్వ పాలనలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో అమరావతి కేంద్రంగా పనిచేసిన పలు ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలకు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ఐదు పని దినాల ఆప్షన్ ను కూడా ప్రభుత్వం సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు సర్కార్ హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధాని మార్పు సందర్భంగా ఇచ్చిన ఈ ఆప్షన్ ను ఇప్పటికే ఓసారి పొడిగించిన జగన్ సర్కార్ ఈసారి ఏం చేయబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది.

ఐదు పని దినాల ఆప్షన్.....
2015లో హైదరాబాద్ నుంచి ఆకస్మికంగా రాజధాని అమరావతికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఉద్యోగులను ఉన్నపళంగా అక్కడి నుంచి రమ్మని కోరే పరిస్దితుల్లో అప్పట్లో చంద్రబాబు సర్కార్ లేదు. దీంతో వారికి ఐదు రోజుల పాటు మాత్రమే పని దినాలు ఉండేటట్లు అవకాశం కల్పించారు. వారం ప్రారంభంలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చే సచివాలయ, హెచ్ వోడీ కార్యాలయాల ఉద్యోగులు తిరిగి వారాంతంలో హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయే వారు. జగన్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఏడాది పాటు ఈ ఆప్షన్ పొడిగించారు.

కుంటుపడిన కార్యకలాపాలు..
రాష్ట్ర ప్రభుత్వ స్ధాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండే సచివాలయంతో పాటు అమరావతిలోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి పరిస్ధితుల ఆధారంగా ఐదు రోజుల పనిదినాలు కల్పించారు. అయితే ఇది కాస్తా పదే పదే పొడిగింపులకు దారితీయడంతో ప్రభుత్వ కార్యకలాపాలు నత్తనడకన సాగుతున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరి 11 గంటలకు విధుల్లోకి వస్తున్న ఉద్యోగులు.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సచివాలయం నుంచి మాయమైపోతున్నారు. దీంతో ఐదు రోజుల పని కాస్తా నాలుగు, నాలుగున్నర రోజులకు తగ్గిపోతోంది. దీంతో పెండింగ్ ఫైళ్లు కూడా పెరిగిపోతున్నాయి. వీటి ప్రభావం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై, ఉద్యోగులపై, జనంపై కూడా పడుతోంది.

ముగుస్తున్న గడువు...
గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు ఐదు పని దినాల ఆప్షన్ ను ఏడాది పాటు పొడిగించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తికాకపోవడం, ఇలాంటి కీలకమైన అంశంపై వెంటనే సమీక్షించి నిర్ణయాలు తీసుకునే పరిస్ధితి లేకపోవడంతో ఏడాద పాటు పొడిగింపు ఇచ్చారు. కానీ ఈ ఏడాదిలో పాలనా వేగం పెరిగింది. ప్రభుత్వం పదుల సంఖ్యలోసంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. రెవెన్యూ లోటు ఉండనే ఉంది. దీంతో పాలనను పరుగులు తీయించక తప్పని పరిస్ధితి ప్రభుత్వానిది. గతేడాది ప్రభుత్వం పొడిగించిన ఐదు పని దినాల గడువు ఈ నెల 27తో ముగిసిపోనుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి.
Recommended Video

రాజధాని మార్పు ప్రభావం- జగన్ నిర్ణయం..
గతంలో హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతికి రావాలంటే కేవలం నాలుగు గంటల ప్రయాణంతో సరిపోయేది. కానీ రాజధాని మార్పుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ నుంచి విశాఖకు రావాలంటే కనీసం 8 నుంచి 9 గంటల ప్రయాణం తప్పనిసరి. దీంతో గతంలోలా ఐదు పనిదినాల పేరుతో ఉద్యోగులు అమరావతికి వచ్చినట్లు విశాఖకు రావడం సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం వీటిని రద్దు చేసే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఉద్యోగుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, ఇప్పటికిప్పుడు రాజధాని మార్పు లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మరో ఏడాది పొడిగింపు ఇచ్చినా ఆశ్చర్యం లేదని తెలుస్తోంది.
-
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications