శిల్పా ఎఫెక్ట్: దిద్దుబాటులో టిడిపి, 'ఉప ఎన్నిక వాయిదాకు కుట్ర'
నంద్యాల: సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయకుండా, వ్యక్తులకు, గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తే నష్టమనే విషయాన్ని టిడిపి నాయకత్వం గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఈ ప్రభావం పడకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం నష్టనివారణ చర్యలకు పూనుకొంది.
సంస్థాగత నిర్మాణం విషయంలో టిడిపి నాయకత్వం కఠినంగానే ఉంటుంది. అయితే పార్టీ అవసరాల రీత్యా 2014 ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చిన నాయకులను టిడిపిలో చేర్చుకొంది. అలా పార్టీలోకి వచ్చిన నేతలు ప్రస్తుతం మంత్రులుగా, ఎంపిలు, ఎమ్మెల్యేలుగా కూడ ఉన్నారు.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తులు, గ్రూపులకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. అయితే ఆ వ్యక్తులు గ్రూపులు పార్టీ మారిన సమయంలో పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నంద్యాలలో శిల్పా సోదరులు పార్టీ మారడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఎట్టకేలకు ఈ విషయాన్ని టిడిపి నాయకత్వం గుర్తించింది. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకుగాను జాగ్రత్తలను తీసుకొంటుంది టిడిపి.

శిల్పా సోదరుల నిష్క్రమణతో టిడిపి ఇలా.
సంస్థాగతంగా టిడిపి కఠినంగా వ్యవహరిస్తోంది. సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కమిటీల ఎన్నికలు తదితర విషయాల్లో నియమాల ప్రకారంగా వ్యవహరించనుంది.అయితే కొన్ని సమయాల్లో కొంత ఇబ్బందిగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇతర పార్టీల్లో మాదిరిగానే వర్గాలకు, గ్రూపులకు, వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి టిడిపికి అనివార్యమైంది. నంద్యాలలో శిల్పా సోదరులు పార్టీ నుండి వెళ్ళిపోయే సమయంలో తమ వర్గాన్ని కూడ పార్టీ నుండి తీసుకెళ్ళారు. దీని ప్రభావం టిడిపిపై నెలకొంది. దీంతో నష్టనివారణకు టిడిపి పూనుకొంది.
Recommended Video


సంస్థాగత నిర్మాణానికే ప్రాధాన్యత
రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే నంద్యాలలో కూడ టిడిపి సంస్థాగత నిర్మాణం దెబ్బతిన్న విషయాన్ని టిడిపి నాయకత్వం గుర్తించింది. వ్యవస్థను కాకుండా వ్యక్తులను, గ్రూపులను సంతృప్తి పర్చే విధానం కారణంగానే నష్టపోతున్న విషయాన్ని టిడిపి గుర్తించింది.నంద్యాలలో టిడిపి ఇంచార్జీగా ఉన్న శిల్పా మోహన్రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.రాయలసీమకు చెందిన ముఖ్యనేతలను నంద్యాల బరిలో దించింది టిడిపి నాయకత్వం.

ఉపఎన్నిక వాయిదాకు కుట్ర
ఓటమి భయంతోనే నంద్యాల ఉప ఎన్నికను వాయిదా వేయించేందుకు వైసీపీ చీఫ్ జగన్ కుట్ర పన్నుతున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి ఆరోపించారు. ఓటమి ఖాయం కావడంతో జగన్ ఉన్మాదిగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. పరిపక్వత లేని జగన్ రాజకీయాలకు పనికిరాడన్నారు.

2019 ఎన్నికలకు నంద్యాల సెమీ ఫైనల్స్
2019 ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించే పార్టీయే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొనే అధికార, విపక్షాలు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి.ఈ నెల 9వ, తేది నుండి వైసీపీ చీఫ్ జగన్ నంద్యాలలోనే మకాం వేశారు.8 మంది మంత్రులు నంద్యాలలోనే మకాం వేశారు. వైసీపీ కీలక నేతలంతా నంద్యాలలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలను చేస్తున్నాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications