ఏపీలో కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభం.. ! ప్రాసెస్, దరఖాస్తులు ఇలా..!
ఏపీలో కొత్తగా పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (AP NTR Bharosa Pension ) కింద కొత్త పెన్షన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారం అర్హులైన దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అనంతరం వాటిని క్షేత్రస్ధాయిలో పరిశీలించి, అర్హులైన వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్తగా పెన్షన్లు (Pensions) కావాలనుకునే వారు స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత/చేనేత కార్మికులు, మత్స్యకారులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 7 నుండి దరఖాస్తుల స్వీకరణ, ఈకేవైసీ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

పెన్షన్లు కావాలనుకునే వారు బియ్యం కార్డ్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్, సదరమ్ పత్రం (దివ్యాంగులకు), భర్త డెత్ సర్టిఫికేట్ (వితంతువులకు) సమర్పించి దరఖాస్తుల్ని నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదు కాపీ ఇస్తారు. అనంతరం ఈ దరఖాస్తుదారుల వివరాలను అధికారులు క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తారు. ప్రభుత్వం సూచించిన అర్హతలు ఉన్నట్లు నిర్ధారిస్తే. వారిని పెన్షన్లు తీసుకునేందుకు అర్హులుగా గుర్తిస్తారు. అనంతరం వీరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications