APSRTC: టెన్త్ విద్యార్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్- ఈ బస్సుల్లో ఫ్రీగా..!

ఏపీలో పదో తరగతి పరీక్షలకు (SSC Exams)హాజరవుతున్న విద్యార్ధులకు ఆర్టీసీ (APSRTC) శుభవార్త చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడే వారికి ఇది ఉపయోగపడబోతోంది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని
అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు 3,415 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందించబోతున్నారు. ఈ మేరకు విద్యార్ధులు బస్సుల్లో కండక్టర్లకు తమ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ తెలిపింది.

APSRTC Extends Free Bus Travel to SSC Candidates During Exams from mar 16 to apr 1

పదో తరగతి విద్యార్ధులు ఇలా పరీక్షలకు వెళ్లేందుకు చేసే ఉచిత ప్రయాణానికి మూడు రకాల బస్సుల్ని అనుమతిస్తున్నారు. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. వీటిలో ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి, తిరిగి వెళ్లేందుకు ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్ధులు నేరుగా ఇంటి దగ్గరే బస్సు ఎక్కి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో పాటు తిరిగి వచ్చేందుకు కూడా వీలు కలగబోతోంది. పరీక్షలు జరిగినన్ని రోజులు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+