ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: అక్కడే జగన్ ఇరుకునపడ్డారని చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వ భూముల్లో 100 గజాల లోపు ఇళ్లు కట్టుకున్న వారికి భూమిని క్రమబద్దీకరించాలని నిర్ణయించారు.
చుక్కల భూముల అనుభవదారులను గుర్తించి వెంటనే హక్కు కల్పించేందుకు చట్టం తేవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మృతదేహాలు తీసుకు వెళ్లేందుకు ఏసీ అంబులెన్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 'బసనతారకం మదర్ కిట్' పేరుతో బాలింతలకు కిట్లు ఇవ్వనున్నారు. కిట్లో ప్లాస్క్, శానిటరీ ప్యాడ్స్, ఇతర వస్తువులు ఉంటాయి.
కేంద్రం రూపొందించిన రియల్ ఎస్టేట్ కార్మిక చట్టాలకు అనుగుణంగా ఏపీలోను చట్టాలు చేయాలని నిర్ణయించారు. ట్రైబల్, సెంట్రల్ వర్సిటీలను వెంటనే ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు.

అక్వా యూనివర్సిటీ డ్రాఫ్ట్ బిల్లును ఆమోదించింది. పీపీపీ పద్ధతిలో ఫిషరీస్ అండ్ ఓషన్ యూనివర్సిటీపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తారు. 50 ఎకరాల్లో రూ.300 కోట్లతో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
చెన్నైకి చెందిన లక్ష్మీ అమ్మాల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు 150 ఎకరాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సభలో ప్రతిజ్ఞ సమయంలో.. వైసిపి ఇరకాటంలో పడింది
సభలో ప్రతిజ్ఞ సమయంలో జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతిజ్ఞ సమయంలో స్పీకర్ కూడా నిలబడ్డారని, వైసిపి నిలబడక పోవడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం స్పీకర్ చైర్ను అవమానించినట్లేనని, దీంతో వైసిపి ఇరకాటంలో పడిందని చంద్రబాబు అన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications