దాచేపల్లి రేప్ ఇష్యూ: చెట్టుకు ఉరేసుకున్న నిందితుడు సుబ్బయ్య
Recommended Video

దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి బాలిక అత్యాచార ఘటన నిందితుడు సుబ్బయ్య ఉరేసుకొని చనిపోయాడు. అత్యాచార ఘటన అనంతరం తాను చనిపోతున్నానని అతను కొందరికి సమాచారం ఇచ్చాడు. అతను కృష్ణా నది వైపు పరుగు పెట్టాడు. దీంతో అతను కృష్ణా నదిలో దూకి చనిపోయి ఉంటాడని భావించారు.
చదవండి: పదిమందికి మంచి చెప్పే నేను, చేయకూడని పని చేశా: ఆత్మహత్యకు ముందు దాచేపల్లి నిందితుడు
దీంతో గురువారం నుంచి అతని కోసం కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. ఆ చుట్టుపక్కల కూడా వెతికారు. అయితే, శుక్రవారం ఉదయం దైద సమీపంలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. అతనిని సుబ్బయ్యగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

17 బృందాలతో గాలింపు
అంతకుముందు, నిందితుడి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలించారు. 17 బృందాలతో అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కృష్ణా నది ఒడ్డున డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు దాచేపల్లిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎస్పీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు ఉంచారు.

నా బిడ్డ కష్టం ఏ బిడ్డకూ రావొద్దు
అత్యాచారానికి గురైన బాలిక తల్లి మాట్లాడుతూ.. ఏ బిడ్డకు ఇలాంటి కష్టం రాకూడదన్నారు. నా బిడ్డ మనోవేధన చూడలేకపోతున్నానని వ్యాఖ్ానించారు. నిందితుడిని మాకు అప్పగిస్తే మరోసారి ఇలాంటివి జరగకుండా శిక్ష వేస్తామన్నారు.

ఆసుపత్రిలో బాలికకు చికిత్స
మరోవైపు, దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు రోజా సహా పలువురు నేతలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. రోజాను మహిళా ఎమ్మెల్యేలు ఈడ్చుకెళ్లారు. అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రోజా పరామర్శించారు.

రోజా ఆగ్రహం
ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు రోజా. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతోందన్నారు. మగాళ్లు అంటేనే ఆ అమ్మాయి భయపడిపోతోందని తెలిపారు. ఆసుపత్రిలోని గదిలోకి హాస్పిటల్ సూపరింటెండెంట్ వచ్చినా భయంతో హడలిపోతోందన్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటసేపు రేప్ చేసి పోతుంటే మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

సుబ్బయ్య ఫ్యామిలీ వైసీపీ సానుభూతిపరులు!
ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందన్నారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. నిందితుడు సుబ్బయ్య సోదరుడి కుమారుడు గురజాల వైసీపీ నాయకుడు అని, వైసీపీ ఫ్లెక్సీలోను సుబ్బయ్య కుటుంబ సభ్యుల ఫోటోలు ఉన్నాయన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications