షాకింగ్: జగన్ అసహనం, సొంత ఫ్యామిలీ టీడీపీ బిటెక్ రవికి సహకరించిందా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
Recommended Video


వివేకాను గెలిపించుకునేందుకు జగన్ ప్రయత్నాలు
కొద్ది రోజుల క్రితం కడపలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసిపి తరఫున జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేశారు. ఆయనను గెలిపించుకునేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్యంగా టీడీపీకి చెందిన బీటెక్ రవి గెలిచారు.

వారే షాకిచ్చారని ప్రచారం
బీటెక్ రవి గెలుపు వెనుక వైయస్ వివేకానంద రెడ్డి అంటే పడని ఆయన కుటుంబ సభ్యులు కూడా హ్యాండ్ ఇచ్చారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్ ఇద్దరు చిన్నాన్నలు భాస్కర రెడ్డి, మనోహర్ రెడ్డిలు వివేకాకు షాకిచ్చారట.

బీటెక్ రవితో కుమ్మక్కు?
కొందరు వైసిపికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పులివెందుల మున్సిపాలిటీలో పలువురు కౌన్సెలర్లను తమ వైపుకు తిప్పుకున్నారని తెలుస్తోందని, వారు బీటెక్ రవితో కుమ్మక్కయ్యారని తెలుస్తోందని అంటున్నారు.

పొసగటం లేదంటున్నారు
అంతేకాదు, ఈ విషయాన్ని గుర్తించిన జగన్ తన చిన్నాన్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారని, దీంతో చిన్నాన్నలు భాస్కర రెడ్డి, మనోహర్ రెడ్డిలతో ఆయనకు పొసగడం లేదని చెబుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications