టీడీపీలో చేరిన డొక్కా.. వైసీపీలో చేరబోతున్న యనమల..!
ఏపీలో ఎన్నికల వేళ నేతల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల పూర్తయినా నేతల ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో అధికార వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న అమరావతి రాజధాని ప్రాంత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీని వీడి ఇవాళ టీడీపీలో చేరిపోయారు. మరోవైపు కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఇవాళ టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేపు ఆయన వైసీపీలో చేరే అవకాశముంది.
గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్.. గత ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఆ పార్టీని వీడి ఎమ్మెల్సీ పదవికీ గుడ్ బై చెప్పారు. తిరిగి వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే వైసీపీలో ఈసారి టికెట్ ఆశించినా దక్కకపోవడం, పార్టీలో ప్రాధాన్యం కూడా తగ్గడంతో చేసేది లేక ఎన్నికల వేళ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

మరోవైపు కాకినాడ జిల్లా తునికి చెందిన టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన యనమల కృష్ణుడు కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వరుసగా రెండుసార్లు తుని నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన కృష్ణుడికి ఈసారి ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న ఆయన.. ఇవాళ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రేపు ఆయన వైసీపీలో చేరే అవకాశముంది.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications