ఏపీలో విపరీతంగా పెరిగిన విద్యుత్ వినియోగం.. యుద్ధమే కారణం.. ఎలాగంటే!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పైన పడింది. మన భారతదేశంలోని అనేక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం పెరిగింది.
ఏపీలో గ్యాస్ కొరత , బాగా పెరిగిన ఇండక్షన్ స్టవ్, ఎలెక్ట్రిక్ కుక్కర్ల వినియోగం
ఈ విద్యుత్ వినియోగానికి యుద్ధమే కారణమని తెలుస్తోంది. అసలు యుద్ధానికి విద్యుత్ వినియోగానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే..పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్యాస్ కొరత ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో ఏపీలో ప్రజలు వంట గ్యాస్ కు బదులుగా ఇండక్షన్ స్టవ్ లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకాన్ని బాగా పెంచారు.

బాగా నమోదవుతున్న విద్యుత్ వినియోగం
దీంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది అసలే ఎండాకాలం కావడంతో ఇప్పటికే కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇక గ్యాస్ కొరత నేపథ్యంలో, చాలామంది గ్యాస్ పైన కాకుండా ఇండక్షన్ స్టవ్ ల పైన, ఎలక్ట్రిక్ కుక్కర్ల లోను వంటను ఎక్కువగా చేస్తూ ఉండడంతో రాష్ట్రంలో మరింత విద్యుత్ డిమాండ్ పెరిగింది. మార్చి 7వతేదీన రికార్డుస్థాయిలో 274. 6మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఏపీలో నమోదయింది.
విద్యుత్ వినియోగం పెరగటానికి యుద్ధం కారణం
గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం 9.15శాతం అధికంగా ఉంది. మార్చి 12 ,13, 14తేదీలలో కూడా వరుసగా సుమారు 272 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదు అయినట్టుగా అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగానికి గ్యాస్ కొరత కారణంగా చెబుతున్నారు. ఈ గ్యాస్ కొరతకు యుద్ధం కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఏపీలో విద్యుత్ అధిక వినియోగానికి ఒకరకంగా పరోక్షంగా యుద్ధం కారణంగా కనిపిస్తుంది.
మే నాటికి బాగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా
ఏపీలో ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు గుర్తించారు. ఈ సంవత్సరం మే నాటికి ఏపీలో విద్యుత్ వినియోగం 280 మిలియన్ల యూనిట్లకు చేరవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి సగం కూడా పూర్తికాకముందే ఇంత ఎక్కువగా విద్యుత్ వినియోగం చేయడం ఇదే మొదటిసారి.
యుద్ధంతో అన్ని రంగాలు ప్రభావితం
ఇదే విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగితే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అన్ని రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన కనిపిస్తుంది. మానవ జీవనం భారంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.
-
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!













Click it and Unblock the Notifications