చరిత్రలో తొలిసారి: ఏపీ కేబినెట్ భేటీకి స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు హాజరుకానున్నారు.
అమరావతి: బుధవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు హాజరుకానున్నారు. కాగా, కేబినెట్ భేటీకి స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి హాజరుకావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఫిబ్రవరిలో జరిగే మహిళా పార్లమెంటు సదస్సుకు సీఎం, మంత్రులను ఆహ్వానించేందుకు స్పీకర్ కోడెల కేబినెట్ సమావేశానికి బయల్దేరారు. కేబినెట్ ఎజెండా ప్రారంభానికి ముందే మంత్రివర్గంతో ఆయన భేటీ కానున్నారు. పార్లమెంటు సదస్సుకు మరింత పాధాన్యం తీసుకొచ్చేందుకే ఆయన సీఎంతోపాటు మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ సెక్రటేరియట్లోనే అడుగుపెట్టే అవకాశమే అరుదు. అలాంటిది కేబినెట్ సమావేశానికి స్పీకర్ కోడెల హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బుధవారం ఉదయం 11.30గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో సంక్షేమ పథకాలు, జన్మభూమి ఫిర్యాదులు, పలు సంస్థలకు భూకేటాయింపులు, జనవరి 26న తలపెట్టిన ఆర్కే బీచ్ ఆందోళనపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications