AP Polls: జూన్ 4న ఏం జరగబోతోందో చెప్పేసిన గంటా- జగన్ కామెంట్స్ కు కౌంటర్.. !
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజులే మిగిలున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాక ప్రచారంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చకు స్పందించిన టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. జూన్ 4 లో విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు గంటా దీటుగా బదులిచ్చారు.
తాజాగా గాజువాకకు ప్రచారానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్ జూన్ 4న తాము గెలిచి ప్రమాణస్వీకారం చేయబోతున్నానని, ఈసారి విశాఖ నుంచే పాలన ఉంటుందని ఆయన తేల్చిచెప్పేశారు. దీంతో మరోసారి విజయంపై జగన్ ధీమా స్పష్టమైంది. అయితే జగన్ వ్యాఖ్యలపై అప్పటి నుంచి టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ గంటా శ్రీనివాస్ స్పందిస్తూ.. జూన్ 4 న జగన్ రాజీనామా చేయబోతున్నారన్నారు.

ఈసారి ఎట్టి పరిస్ధితుల్లోనూ జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా కూటమి పనిచేస్తోందని గంటా శ్రీనివాస్ తెలిపారు. వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని గంటా వెల్లడించారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కూటమిగా ఏర్పడినట్లు గంటా వివరించారు. ఇవాళ ఆయన భీమిలి మ్యానిఫెస్టోను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మ్యానిఫెస్టోపై మాట్లాడుతూ.. ఇందులో దేనికీ పొంతన లేదని, పాత మేనిఫెస్టోనే రిపీట్ చేశారన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications