అమరావతికి స్ధల దోషం..! అందుకే అలా.. జర జాగ్రత్త -చంద్రబాబు మాజీ మిత్రుడు షాకింగ్..!
ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడు కొనసాగిస్తుండగా.. విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే క్రమంలో మరో సీనియర్ రాజకీయ నేత, సీఎం చంద్రబాబుకు మాజీ మిత్రుడు కూడా అయిన రాయలసీమ పొలిటిషియన్ ఇవాళ మరోసారి అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజధాని అమరావతిపై పరిస్థితులు బాగాలేవని, కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా వరకు ప్రజలెవరూ సంతోషంగా లేరని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. రాయలసీమలో రాజధానిపై చిచ్చు మొదలైందన్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, న్యూట్రల్ గా ఉంటానని వెల్లడించారు. నా మిత్రుడు చంద్రబాబు నాయుడు ఆశించిన రీతిలో అమరావతి క్లిక్ కాకపోవచ్చనేది తన అనుమానం అన్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలిపారు.

ఏపీకి పెట్టుబడులు రావడం అంత సులువు కాదని, అమరావతికి స్థల దోషం ఉన్నట్లు ఉందని చింతా మోహన్ తెలిపారు. పెట్టుబడులు వస్తాయన్న నమ్మకం తనకైతే లేదన్నారు. ప్రత్యేక విమానాల్లో ముఖ్యమంత్రి వెళ్లారని, ప్రత్యేక గదుల్లో ఉన్నారని, దానివల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చేశారు. చంద్రబాబు నాయుడు ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతాడని, ఏపీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడని తాను అనుకున్నానని, కానీ ఎక్కడో బెడిసి కొట్టిందన్నారు.

మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు, గౌతు లచ్చన్న.. నెహ్రూ, ప్రకాశం పంతులకు తిరుపతిని రాజధాని చేయమని చెప్పారని, గౌతు లచ్చన్న ప్రతిపాదనను, ఎన్జీ రంగా, తరిమెల నాగిరెడ్డి బలపరిచారన్నారు. కానీ నీలం సంజీవరెడ్డి కర్నూలుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. తర్వాత హైదరాబాదుకు, ఇప్పుడు రాజధాని అమరావతికి తన మిత్రుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు.
మరోవైపు ఏపీలో మద్యం స్కాం దర్యాప్తుపైనా చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో పొలిటీషియన్లు ఉన్నారని, ఏపీ ప్రభుత్వం సిట్ వేసిందని, వారం రోజుల లోపు సిట్ రిపోర్ట్ బయటపెట్టాలని ఆయన కోరారు. నిజాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. నాసిరకం లిక్కర్ తాగి, కిడ్నీలు, లివర్ చెడిపోయాయి. ఎంతోమంది నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన గుర్తుచేసారు. లిక్కర్ స్కామ్ లో తప్పు చేసినవారికి శిక్ష తప్పదన్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా, ప్రభుత్వ ఆస్తిని కొన్నందుకు, ఆమె మరణించిన తరువాత కూడా కోర్టు శిక్ష వేసిందని గుర్తుచేశారు.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట!












Click it and Unblock the Notifications