త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రమంత్రి అయిన కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లాను పురోగతి మార్గంలో ప్రయాణం చేసేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు వరప్రదాయినిగా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరుండి మరి నిర్మాణం చేయిస్తున్న కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లాకు రవాణాసౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామికంగా పురోగతి మార్గంలో ప్రయాణం చేస్తుందని భావిస్తున్నారు.
మూడు రైల్వే హాల్ట్ లను ప్రారంభించిన కేంద్రమంత్రి
ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు నడుస్తున్న రైళ్ల విషయంలో కూడా ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. హరిశ్చంద్రపురం వద్ద గుణ పూర్ విశాఖ ఎక్స్ప్రెస్, పాతపట్నం వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్, మందస వద్ద బ్రహ్మ పురం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్త రైల్వే హాల్ట్ లను ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

శ్రీకాకుళం నుండి తిరుపతి, హైదరాబాద్ లకు నేరుగా వెళ్లేలా రైళ్ళు
జిల్లా రైల్వే రంగ అభివృద్ధిలో ఆరు రైల్వే హాల్ట్ లకు 45 రోజుల స్వల్ప వ్యవధిలో అనుమతి లభించడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి తిరుపతి, హైదరాబాద్ లకు నేరుగా వెళ్లేలా రైళ్లను నడిపేందుకు కృషి చేస్తానంటూ వెల్లడించారు.
తిరుపతి, హైదరాబాద్ లకు నేరుగా రైళ్ళు.. కీలక అడుగు పడిందన్నమంత్రి
తిరుపతి, హైదరాబాద్ కు నేరుగా రైళ్ళు కావాలనే డిమాండ్ ఎంతో కాలంగా జిల్లా వాసుల నుండి వినిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రస్తుతం దీనిపైన సర్వే కొనసాగుతోందని ఆయన శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వెనుకబాటుకు గురైన శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాలలోనూ ముందుకు తీసుకు వెళ్లడానికి కూటమి ప్రభుత్వ హయాంలో కృషి జరుగుతుందన్నారు.
జిల్లాను అగ్రభాగంలో నిలిపేలా కృషి చేస్తానన్న కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించి చర్యలు చేపడుతుందని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీ పైన వరాలజల్లు కురిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చి, జిల్లాను అగ్రభాగంలో నిలిపేలా కృషి చేస్తానని ఆయన జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు.
-
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక













Click it and Unblock the Notifications