ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఉచిత ఇసుక విధానానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటినుండంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఇసుక పాలసీ పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఏపీలో ఇసుక పంపిణీ విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని మళ్లీ ఇప్పుడు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఏపీలో మళ్ళీ ఉచిత ఇసుక విధానం
ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని జులై 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి ఇసుక లోడింగ్, రవాణా చార్జీలు నిర్ణయించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

జగన్ ఇసుక పాలసీతో ప్రజలు నష్టపోయారు
నిన్న సుదీర్ఘంగా ఇసుక విధానం పైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు జగన్ పరిపాలన సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణరంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
ఉచిత ఇసుక విధానంపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో పాటు ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 40 లక్షల టన్నులు ఇసుక అందుబాటులో ఉందని లెక్క చెప్పారు అధికారులు. ఇక తాజాగా ఉచిత ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఉచిత ఇసుక విధానం శుభ పరిణామం: మంత్రి కొల్లు రవీంద్ర
ఇక తాజాగా చంద్రబాబు జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధాన అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవటం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లు ఇసుక పేరుతో వైసిపి నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో జనాలకు ఇసుక కష్టాలున్నాయన్న మంత్రి
వైసిపి అధికారంలోకి రాగానే ఇసుక లభ్యం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని నిర్మాణరంగం కుదిలైందని మంత్రి పేర్కొన్నారు. కోట్లాదిమంది జీవనోపాధి కోల్పోయారని అన్నారు. ఇక తాజాగా చంద్రబాబు తీసుకున్న సంచలన నిర్ణయంతో ఏపీ ప్రజలకు మరో శుభవార్త అందినట్టు అయింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications