ఏపీలో దంచికొడుతున్న వర్షాలు-రాకపోకలపై తీవ్ర ప్రభావం-ప్రాజెక్టుల్లోకి వరద
ఏపీలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్ో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పలు గ్రామాలు నీటమునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొదలైన వర్షాలు ఇవాళ మరింత భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జన జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం,విశాఖ పట్నంలో నిన్న రాష్ట్రంలోనే అతి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళంలోని రణస్దలంలో 125 మి.మీ, విశాఖలోని పెందుర్తిలో 110 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్ధితి.

జనజీవనంపై తీవ్ర ప్రభావం
భారీ వర్షాల ప్రభావం పలు జిల్లాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్ష ప్రభావంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తీర ప్రాంతాల్లో అయితే భారీగా ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లపైకి నీరు రావడంతో పలు చోట్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్టీసీ కూడా పలు సర్వీసుల్ని రద్దు చేస్తోంది. రైళ్ల రాకపోకల్ని కూడా అధికారులు నియంత్రిస్తున్నారు. దీంతో ప్రయాణికులు కూడా బిక్కుబిక్కుమంటూ స్టేషన్లు, బస్టాండ్లలో ఎదురుచూడాల్సిన పరిస్ధితి.

ఇవాళ మరింత భారీ వర్షాలు
ఇవాళ కోస్తాంధ్రలో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని తీర ప్రాంతాల్లో మత్సకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ఇవాళ ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
అలాగే విశాఖ, గుంటూరు, ప్రకాశంలోనూ భారీ వర్తాలు తప్పవని హెచ్చరించింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని తెలిపింది. అటు రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రభుత్వం కూడా స్ధానికంగా అధికారుల్ని అప్రమత్తం చేస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications