ఏపీలో రక్తమోడిన రోడ్లు.. గుంటూరులో ముగ్గురు స్పాట్ డెడ్, ముగ్గురికి తీవ్ర గాయాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రోడ్లు రక్తమోడాయి. నంద్యాలలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా, గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గుంటూరు జిల్లాలో దుర్ఘటన
గుంటూరు జిల్లాలోని అంకిరెడ్డిపాలెం సమీపంలో ఈ దుర్ఘటన జరగగా మృతులంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తుంది. వీరు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ డిఎస్పి భానోదయ, సీఐ వంశీధర్ సంఘటన స్థలానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు.కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

నంద్యాల జిల్లాలోనూ ఘోర ప్రమాదం
కాగా ఈ రోజు తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి 40 పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి
ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల బత్తులూరు మధ్యన జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి ఎదురుగా వస్తున్న cgr ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి ప్రమాదం బారిన పడ్డారు.
తీవ్ర గాయాల పాలైన బాధితులను ఆస్పత్రికి తరలింపు
ఈ ఘటనలో మృతులు హైదరాబాద్ వాసులైన 60 సంవత్సరాల గుండు రావు, 22 సంవత్సరాల శ్రావణ్, నరసింహ, బన్నీలు గా పోలీసులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టి తీవ్ర గాయాల పాలైన బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి
ఈ రోడ్డు ప్రమాద ఘటన పైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాయాల పాలైన క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించాలని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వాహనదారులు బీ అలెర్ట్
ఇక కారు ఢీ కొట్టిన బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళుతుంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు ఎవరికీ, ఎటువంటి గాయాలు కాలేదు. అయితే వారిని వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. డిసెంబర్ మాసం ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే మాసం కావడం వల్ల వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మితిమీరిన వేగంతో నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications