Vizag : వైజాగ్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం-పెరిగిన క్రైమ్ రేట్ తో ..!
ఏపీలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో కీలకమైన విశాఖ నగరంలో ఓవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నా.. మరోవైపు పెరిగిన నేరాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా స్ధానికంగా సాక్షాత్తు సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కొందరు పాత నేరస్తులు కిడ్నాప్ చేసి దారుణంగా వేధించడం, ఆ తర్వాత పోలీసులు వారిని పట్టుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత కూడా కిడ్నాప్ ల పర్వం కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తులో ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖలో నేరాల అదుపు కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైజాగ్ నగరాన్ని టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తీసుకొస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సిటీలో జరుగుతున్న నేరాలను స్ధానికంగా ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై టాస్క్ ఫోర్స్ ఈ నేరాల విచారణ చేపట్టబోతోంది.

ప్రస్తుతం వైజాగ్ సిటీ పరిధిలో ఉన్న అన్ని కమిషనరేట్లను టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తెస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నగరంలో ఎక్కడ నేరాలు జరిగినా వాటిపై టాస్క్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టేందుకు వీలు కలిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక తాజాగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. వీటిలో మొదటిది స్ధానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్. ఎంపీ కుటుంబానికే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్ధితి ఏంటనే చర్చకు ఇది కారణమైంది.
అలాగే మరో రియల్టర్ కుటుంబం కూడా కిడ్నాప్ కు గురైంది. శ్రీనివాస్ అనే రియల్టర్ తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు. పాత లావాదేవీల నేపథ్యంలో జరిగిన ఈ కిడ్నాప్ కూడా కలకలం రేపింది. దీంతో ఈ ఘటన కూడా పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో ప్రభుత్వం ఇవాళ నగర పోలీసు వ్యవహారాల్ని టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణలోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications