రైల్వే మంత్రికి జగన్ సర్కార్ కౌంటర్-వైజాగ్ రైల్వే జోన్ భూసేకరణపై క్లారిటీ..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అదే సమయంలో కేంద్ర బడ్జెట్ రావడం, అందులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ఓ ప్రకటన వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. కీలకమైన ఎన్నికల వేళ రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని తాకాయి. దీంతో ఇవాళ వాటిపై అధికారులతో క్లారిటీ ఇప్పించింది. వైజాగ్ రైల్వే జోన్ కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడంపై రైల్వే మంత్రి చేసిన వ్యాఖ్యలపై సర్కార్ స్పందించింది.
నిన్న కేంద్ర బడ్జెట్ తర్వాత రైల్వే కేటాయింపులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఆ సమయంలో మీడియా వైజాగ్ రైల్వే జోన్ పనుల జాప్యంపై ఆయన్ను ప్రశ్నించింది. దీంతో ఆయన ఫైర్ అయ్యారు. ఆ విషయం తనను ఎందుకు అడుగుతారని, ఏపీ ప్రభుత్వాన్నే అడగాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం వైజాగ్ రైల్వే జోన్ కు కావాల్సిన భూమిని సేకరించకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరోక్షంగా చెప్పేశారు.

దీనిపై ఇవాళ అధికారులు స్పందించారు. వైజాగ్ రైల్వే జోన్ కోసం విశాఖ జిల్లా ముదసర్లోవలో భూమిని కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. సర్వే నంబర్ 26లో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్ కోసం ఇచ్చినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. రైల్వేతో ఏపీ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారమే ఈ భూమిని కేటాయించినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ కోసం వారు ఎంత అడిగారో అంతే ఇచ్చినట్లు తెలిపారు. దీంతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిన్న చేసిన ప్రకటన తప్పని తేలిపోయింది.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications