Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబుకు ఝలక్-కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు..
ఏపీలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే, జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు స్ధానిక కోర్టు ఇవాళ ఝలక్ ఇచ్చింది. స్ధానికంగా సంక్రాంతి సందర్భంగా డ్రా పేరుతో టికెట్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మంత్రిపై కేసు నమోదుచేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి డ్రా పేరుతో స్ధానికంగా వసూళ్లు చేస్తున్నట్లు జనసేన నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పోలీసుల్ని కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు దీనిపై స్పందించలేదు. దీంతో వారు స్ధానిక న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన స్ధానిక కోర్టు.. అంబటిపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసుల్ని ఆదేశించింది.

వాస్తవానికి సత్తెనపల్లిలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారు. అప్పటి నుంచి అంబటికీ,జనసేన నేతలకూ మధ్య పోరు సాగుతోంది. స్ధానికంగా ఓ మహిళకు ప్రభుత్వం ఇచ్చిన సాయంలో వాటా అడిగారంటూ జనసేన నేతలు ఆరోపించారు. దీనిపై అంబటి స్పందించి సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనంతరం స్ధానికంగా సంక్రాంతి డ్రా నిర్వహణపైనా జనసేన నేతలు అంబటిని టార్గెట్ చేశారు. దీంతో అంబటి ఇరుకునపడ్డారు. అయితే పోలీసులు మాత్రం జనసేన నేతల ఫిర్యాదును లైట్ తీసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించి కేసు నమోదు ఆదేశాలు తెచ్చుకున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications