జీఎస్టీపై స్పందించిన నారా బ్రాహ్మణి: ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: వస్తుసేవల పన్ను(జీఎస్టీ)తో కార్పొరేట్ కంపెనీలతోపాటు సాధారణ జనాలకు కూడా లాభమేనని హేరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి అన్నారు. శనివారం హైదరాబాద్ కస్టమ్స్ కార్యాలయంలో జరిగిన జీఎస్టీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. జీఎస్టీ అమలవుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరిందని అన్నారు. అంతర్జాతీయ వ్యాపారాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ను ప్రోత్సహిస్తుందని ఆమె చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

జీఎస్టీ అమలులోకి రావడం శుభపరిణామమని బ్రాహ్మణి అన్నారు. జీఎస్టీ సేవా వివిధ రకాల పన్నులను రద్దుచేసి ఏకీకృత జీఎస్టీని కేంద్రం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీతో వినియోగదారుడికి, వ్యాపార వర్గాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించనుందని అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో తగ్గిన ధరలను తక్షణమే తమ ఆస్పత్రుల్లో అమలుచేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు భట్నాగర్ తెలిపారు.
బషీర్బాగ్లోని కేంద్ర జీఎస్టీ, కస్టమ్స్ శాఖ ప్రధాన కార్యాలయంలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రాహ్మణితోపాటు అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి, జీఎస్టీ చీఫ్ కమిషనర్ సందీప్ ఎం.భట్నాగర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ వెబ్పోర్టల్ను చీఫ్ కమిషనర్ భట్నాగర్ ప్రారంభించారు. కేంద్రాల కోసం ముద్రించిన మార్గదర్శకాల సంచికను ఆవిష్కరించారు.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి నుంచే జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ అమలుతో పలు వస్తువుల ధరల్లో తేడాలు రానున్నాయి. అయితే, జీఎస్టీ అమలు వల్ల సామాన్య జనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications