వైసీపీది తప్పే కానీ.. ఆ మాటలూ..! పవన్ షాకింగ్ కామెంట్స్..!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో తాజాగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు నిరసనలు కూడా చేశారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందించారు. ఏబీఎన్ పై వైసీపీ దాడుల్ని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్ (pawan kalyan).. అదే సమయంలో ఛానల్లో ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలూ సరికాదన్నారు. ఈ సందర్భంగా గతంలో వైసీపీ నేతలు వాడిన భాషను పవన్ గుర్తుచేశారు.
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయని, వాటిపై స్పందించడంలోను ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పవన్ కళ్యాణ్ కోరారు. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరన్నారు. విమర్శలకు దాడులు సమాధానం కావని, విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయన్నారు.

పదాలను వాడేముందు వాటికున్న విలువలను గౌరవించాలని జనసేన నేతల్ని పవన్ కోరారు. పదునైన, వ్యంగ్యంతో కూడిన పదాలు వాడినా ఎదుటివారు స్వీకరించేలా ఉండాలన్నారు. ఎదుటివారు హద్దులు మీరి మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులుపెట్టినా చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఏబీఎన్ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ పత్రికలో రాసిన కొత్త పలుకులో ఘాటైన పదాలు ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. ఏబీఎన్ ఛానెల్ లో ప్రసారమైన వీకెండ్ కామెంట్ ను తాను వీక్షించలేదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని వైసీపీకి సూచించారు.
-
పవన్ భార్య ఎమోషనల్ పోస్ట్.. "రెండో జన్మ" అంటూ !! -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కేంద్రం గుడ్ న్యూస్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వివాదాల 'శాంతి'కి జైలు శిక్ష.. అవినీతి సామ్రాజ్యంపై ఏసీబీ పంజా! -
2029లోనూ ఏపీలో ఎవరు గెలవచ్చు ? తేల్చేసిన ఉండవల్లి..! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!!














Click it and Unblock the Notifications